కొవిడ్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులపై విచారణ

by  |
కొవిడ్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులపై విచారణ
X

దిశ, వెబ్‎డెస్క్ : ఏపీలో కొవిడ్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా బాధితుల వద్ద అధిక ఫీజుల వసూలుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నామని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నావోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు.

Next Story