ఆనందయ్య ‘K’ రకం మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

by  |
ఆనందయ్య ‘K’ రకం మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆనందయ్య పంపిణీ చేసే మందుల్లోని ‘K’ రకం మందుకు కూడా హైకోర్టు అనుమతినిచ్చింది. ఆనందయ్య ఇచ్చే ‘K’ రకం మందును వెంటనే బాధితులకు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఆనందయ్య తయారుచేసే పీ, ఎఫ్, ఎల్ మందులకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి ఇవ్వలేదు. ‘k’ మందుకు కూడా నాడు అనుమతి ఇవ్వలేదు. సోమవారం వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ‘k’ మందు పంపిణీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. మరోవైపు కంట్లో వేసే చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక అందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

Next Story

Most Viewed