ఆ ప్రచారం మానసికంగా కుంగదీస్తోంది: హీరోయిన్

by  |
ఆ ప్రచారం మానసికంగా కుంగదీస్తోంది: హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్, బీజేపీ లీడర్ మాధవీలత పోలీసులను ఆశ్రయించారు. ఓ వర్గం తనను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతోందని గురువారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏదైనా కేసులో అమ్మాయిలు పట్టుబడితే అందులో నేనున్నట్లు ప్రచారం చేస్తున్నారు, ఇలాంటి వాటిపై మానసికంగా మరింత కుంగిపోవాల్సి వస్తోందని ఫిర్యాదులో వెల్లడించారు. తనపై అసభ్యకర చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీకి విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed