దర్శకుడి భౌతిక దేహం కోసం హీరో సూర్య పాట్లు..

by  |
దర్శకుడి భౌతిక దేహం కోసం హీరో సూర్య పాట్లు..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందిన విషయం తెలిసిందే. ఓవైపు కోవిడ్ సెకండ్ వేవ్ దేశంలో కల్లోలం సృష్టిస్తుంటే ఆయన ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడం అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవీ ఆనంద్ మరణానికి గుండెపోటు మాత్రమే కారణం కాదని, ఆయన ఇటీవల కరోనా బారిన కూడా పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆయనను చేర్చుకున్న హాస్పిటల్ యాజమాన్యం ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి నిరాకరించిందని సమాచారం. అయితే కేవీతో అనుబంధం ఉన్న స్టార్ హీరో సూర్య సైతం కేవీ పార్థీవ దేహాన్ని ఆసుపత్రి నుండి తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటీకే ఆసుపత్రి వర్గాలతో సూర్య మాట్లాడారని, కరోనా వలన మృతిచెందడంతో కేవీ పార్థీవదేహాన్ని ఆసుపత్రి వర్గాలు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తుంది.

క‌రోనా నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆనంద్ మృత‌దేహాన్ని న‌గ‌ర్ ఎల‌క్ట్రిక‌ల్ అంత్య‌క్రియ‌శాల‌కు పంపిస్తామ‌ని హాస్పిటల్ సిబ్బంది స్పష్టం చేసినట్లు వినికిడి. దీంతో తమ అభిమాన దర్శకుడిని కడచూపు కూడా చూడలేని పరిస్థితి దాపురించిందని పలువురు ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story