హీరో రామ్ నాకు తెలియదు: ఏసీపీ

by  |
హీరో రామ్ నాకు తెలియదు: ఏసీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై హీరో రామ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ ఏసీపీ స్పందించారు. హీరో రామ్ ఎవరో తనకు తెలియదన్నారు. కొవిడ్ కేర్ సెంటర్‌కు, క్వారంటైన్ కేంద్రానికి చాలా తేడా ఉందన్నారు. స్వర్ణ ప్యాలెస్‌లోని క్వారంటైన్ కేంద్రంలో విదేశాల నుంచి వచ్చేవారు ఉండేవారిని, అందుకు వారు కొంత మొత్తం చెల్లించేవారని ఏసీపీ తెలిపారు.

కాగా, స్వర్ణ ప్యాలెస్‌లో మొదట ప్రభుత్వమే క్వారంటైన్ సెంటర్ నిర్వహించిందని, ఆ సమయంలో అగ్నిప్రమాదం జరిగి ఉంటే..ప్రభుత్వాన్ని నిందించేవాళ్లమా అని హీరో రామ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రమేశ్ ఆసుపత్రి ఎండీ రమేశ్ బాబు.. హీరో రామ్‌కు బాబాయ్ అవుతారు.

Next Story

Most Viewed