‘సీఎం జగన్ పై పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది’

by  |
‘సీఎం జగన్ పై పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది’
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన ట్విట్టర్‌లో సెన్సేషనల్ ట్వీట్ చేశాడు. ఇటీవల విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన ఇస్మార్ట్ శంకర్ హాట్ కామెంట్స్ చేశాడు.

ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది!! సీఎం జగన్‌ని త‌ప్పుగా చూపించ‌డానికి! జగన్ గారు మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్ కీ‌, మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం’ అంటూ సంచలన ట్వీట్ చేశాడు.

అంతకుముందు ట్వీట్‌లో స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ ఆస్పత్రి నిర్వాహకులపై రామ్ ఆరోపణలు చేశాడు. అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా? అంటూ ప్రశ్నించాడు. ఫీజుల వివరాలు.. మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌ప్యాలెస్‌ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసిందని చెప్పాడు.

హోటల్ స్వర్ణ ప్యాలస్‌ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కొవిడ్ సెంటర్‌గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించిందని ఆయన తెలియజేశాడు. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు అంటూ పోతినేని రామ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా, అటు ఏపీలో సంచలనంగా మారింది. ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండే రామ్ ఒక్కసారిగా ఈ విధంగా స్పందించడం గమనార్హం.


Next Story

Most Viewed