ఏపీ వరద బాధితులకు అండగా డార్లింగ్ ప్రభాస్.. భారీగా విరాళం

by  |
ఏపీ వరద బాధితులకు అండగా డార్లింగ్ ప్రభాస్.. భారీగా విరాళం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కురిసిన అకాల వర్షాలకు వరదలు పోటెత్తడంతో తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. రైతుల పంట పొలాలు, ప్రజల గృహాలు వరదల ధాటికి నేలమట్టమై ఎంతో మంది రోడ్డున పడ్డారు. దీంతో వీరందరినీ ఆదుకునేందుకు సినీ తారలు ప్రభుత్వానికి విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన కొందరు హీరోలు, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇతర హీరోలు చెరో రూ.25 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు అందించనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే చెక్కును సీఎం జగన్‌కు అందించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభాస్ కరోనా సమయంలోనూ తెలుగు రాష్ట్రాల సీఎంలకు రూ.50 లక్షల చొప్పున విరాళం అందించిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed