- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ కనకదుర్గమ్మను సినీ నటి హేమ గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నటి హేమకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం హేమ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరా సందర్భంగా.. ప్రతీ ఏటా అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపారు. కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.
రాత్రి గెలిచాం..ఉదయం ఓడిపోయాం
‘మా ఎన్నికల్లో రాత్రి గెలిచాం.. ఉదయం ఓడిపోయాం..ఏం జరిగిందో ఆ అమ్మవారికే తెలియాలి’ అని హేమ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ‘మా’ ఎన్నికలపై యాంకర్ అనసూయ సైతం ట్విట్టర్ వేదికగా అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హేమ వ్యాఖ్యలు చూస్తుంటే మాలోని మంటలు ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడం లేదు. మా అధ్యక్షుడు మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే అవేమీ పట్టనట్లుగా విష్ణు మాత్రం తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు. బుధవారం ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. గురువారం నందమూరి బాలకృష్ణను కలిసి తాజా పరిణామాలపై చర్చించారు.