నిరాశ్రయులకు చేయూత ఇవ్వండి : మంత్రి

by  |
నిరాశ్రయులకు చేయూత ఇవ్వండి : మంత్రి
X

దిశ, మహబూబ్‌నగర్: నిరాశ్రయులకు చేయూత ఇచ్చేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ గెస్ట్‌హౌస్‌లో నిరాశ్రయులకు, యాచకులకు ఏర్పాటు చేసిన ఆశ్రమాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో 50 మంది నిరాశ్రయులకు పండ్లు, దుప్పట్లు, ప్లేట్, గ్లాస్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags: Help,poor, people, homless, mahaboobnagar, minister srinivas goud


Next Story

Most Viewed