ఏపీ-తెలంగాణ బార్డర్‌‌లో భారీగా ట్రాఫిక్‌‌జామ్

by  |
ఏపీ-తెలంగాణ బార్డర్‌‌లో భారీగా ట్రాఫిక్‌‌జామ్
X

దిశ, కోదాడ: తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ట్రాఫిక్ జామ్ పెరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌‌ రోడ్‌‌లో శనివారం వాహనాల రద్దీ నెలకొంది. వీకెండ్‌‌ కావడం, లాక్‌‌డౌన్‌‌ నిబంధనలు సడలించడంతో ఆంధ్రప్రదేశ్‌‌ నుండి హైదరాబాద్‌‌కు వచ్చే వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనితో సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్‌‌పోస్ట్‌ వద్ద వాహనదారులకు‌ ట్రాఫిక్ ఇక్కట్లు తప్పలేదు . తెలంగాణలోకి వచ్చే వాహనాలను ఈ పాస్‌‌లను చూసి పోలీసులు అనుమతిస్తుండడంతో, వాహనాలు చెక్‌‌పోస్టు దాటేందుకు అధిక సమయం పట్టింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌‌జామ్ అయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌‌కు వెళ్ళే వాహనాలు కూడా కొంతమేర నిలిచిపోయాయి. పోలీస్‌ ‌అధికారులు స్పందించి వెంటనే వాహనాలను పంపిచేలా చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

Next Story