సడలింపుతో రహదారులు రద్దీ

by  |
సడలింపుతో రహదారులు రద్దీ
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ సడలింపు ప్రభావం రహదారులను తాకింది. దాదాపు 50 రోజుల పాటు ఇళ్లకు పరిమితమైన ప్రజలు.. సడలింపుతో ఒక్కసారిగా తట్టాబుట్టా సర్దుకుని రొడ్డెక్కారు. దీంతో ఆయా రహదారులు రద్దీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్లే మార్గమధ్యలో ఉన్న టోల్‌ గేట్ల వద్ద వాహనాలు క్యూ కడుతున్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా సరిహద్దులోని టోల్ గేట్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. గంటలు గంటలు క్యూలో ఉండి ప్రయాణికులు తమ తమ గమ్యాలకు చేరుకుంటున్నారు. రానున్న రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.



Next Story

Most Viewed