రాష్ర్ట సరిహద్దులో భారీ వర్షం.. నేలకూలిన షెడ్లు

by  |
రాష్ర్ట సరిహద్దులో భారీ వర్షం.. నేలకూలిన షెడ్లు
X

దిశ, కరీంనగర్: రాష్ట్ర సరిహద్దున ఉన్న కాళేశ్వరం గోదావరి నది తీరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అంతరాష్ట్ర వంతెన వద్ద రెవెన్యూ, పోలీసు విభాగాలు ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ పాయింట్లు కొట్టుకపోయాయి. లాక్‌డౌన్ కారణంగా అంతరాష్ట్ర వంతెన వద్ద రాకపోకలను నిలువరించేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు షెడ్లు నేలకూలాయి. అయితే ఈ సమయంలో ఈ షెడ్లలో ఎవరూ లేకపోవడంతో ఎటాంటి హాని జరగలేదు. అలాగే గ్రామంలోని పలువరి ఇళ్లపై వేసిన రేకులు కూడా ఎగిరిపోయాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Next Story