సౌతాంప్టన్‌లో భారీ వర్షం.. మ్యాచ్‌కు బ్రేక్

by  |
WTC Final, Southampton
X

దిశ, వెబ్‌డెస్క్ : కాసేపట్లో న్యూజిలాండ్, భారత్ మధ్య సౌతాంప్టన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి సౌతాంప్టన్‌లో ఆకాశం మేఘావృతమైంది. ఈ క్రమంలోనే కాసేపటి నుంచి అక్కడ ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా మొదటి రోజు ఇన్నింగ్స్‌లో మొదటి సెషన్ రద్దు అయ్యే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ ట్విట్టర్‌లో తెలిపింది. కాసేపట్లో టాస్ వేసే సమయం కానుండటం.. ఇంతలో వర్షం కురుస్తుండటంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Next Story

Most Viewed