- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హుజురాబాద్, బద్వేలు ఉప ఎన్నిక శనివారం జరుగునున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని బద్వేలు ఉప ఎన్నికపై వరుణుడి ఎఫెక్ట్ పడింది. బద్వేలు ఉప ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో భారీ వర్షం పడడంతో అధికారులు టెన్షన్లో మునిగిరారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రంలో జలమయం అయ్యింది. దీంతో ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రిని బాలయోగి గురుకుల పాఠశాలకు తరలిస్తున్నారు. అయితే, సామాగ్రి పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తం అవగా.. వర్షం అడ్డంకిగా మారింది. దీంతో అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రి తడవకుండా జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story