బార్డర్ లో భారీగా గంజాయి పట్టివేత

by  |
Ganjayi11
X

దిశ, జహీరాబాద్: జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మంగళవారం చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద టాస్క్ ఫోర్స్ టీమ్, జహీరాబాద్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ లారీలో తరలిస్తున్న 420 కిలోల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని ఏలూరు వద్ద గంజాయి ప్యాకెట్లను లారీ క్యాబిన్ వెనుక భాగంలో రహస్య ప్రదేశంలో పెట్టి అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు పంపారు.

Next Story

Most Viewed