- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకినాడలో వలకు చిక్కిన కొమ్ము కోనాలు
by Vemula.Srinu Prasad |
<p>కాకినాడ పోర్టు ఏరియాలోని కుంభాభిషేకం రేవులో మత్స్యకారులకు రెండు భారీ కొమ్ము కోనాం (టూనా ఫిష్) చేపలు వలకు చిక్కాయి. ఇంత పెద్దసైజు కొమ్ము కోనాం చేపలు వలకు చిక్కడం ఇదే తొలిసారని మత్స్యకారులు చెబుతుంటే.. ఇంత పెద్ద కోనాం చేపలు చూడడం ఇదే తొలిసారని మరికొందరు పేర్కొంటున్నారు. ఒక్కో చేప 125 కిలోల బరువు తూగిందని తెలుస్తోంది. ఇది కేజీ వెయ్యి రూపాయల ధర పలుకుతుందని మత్స్య కారులు చెబుతున్నారు. వీటికి జపాన్, హాంకాంగ్ దేశాల్లో […]</p>

X
కాకినాడ పోర్టు ఏరియాలోని కుంభాభిషేకం రేవులో మత్స్యకారులకు రెండు భారీ కొమ్ము కోనాం (టూనా ఫిష్) చేపలు వలకు చిక్కాయి. ఇంత పెద్దసైజు కొమ్ము కోనాం చేపలు వలకు చిక్కడం ఇదే తొలిసారని మత్స్యకారులు చెబుతుంటే.. ఇంత పెద్ద కోనాం చేపలు చూడడం ఇదే తొలిసారని మరికొందరు పేర్కొంటున్నారు. ఒక్కో చేప 125 కిలోల బరువు తూగిందని తెలుస్తోంది. ఇది కేజీ వెయ్యి రూపాయల ధర పలుకుతుందని మత్స్య కారులు చెబుతున్నారు. వీటికి జపాన్, హాంకాంగ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంటుందని, వీటిని అక్కడికే ఎగుమతి చేస్తారని మత్స్యకారులు తెలిపారు. కాగా, చేపల వేటపై నిషేధాన్ని 15 రోజుల క్రితమే ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఇవి వలకు చిక్కాయి.
Next Story






