భారీగా డ్రగ్స్ స్వాధీనం

by  |
భారీగా డ్రగ్స్ స్వాధీనం
X

దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. దాడుల్లో 250 కిలోల మెపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై కేంద్రంగా ముఠా డ్రగ్స్ దందా నడిపిస్తోంది. హైదరాబాద్‌లో రా మెటీరియల్స్‌ను ఈ ముఠా తయారు చేసి ముంబైకి డ్రగ్స్ సరఫరా చేస్తోంది. మియావ్ మియావ్ డ్రోన్ పేర్లతో డ్రగ్స్‌ను ముఠా విక్రయిస్తోంది. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ లో 4 చోట్ల డీఆర్ఐ సోదాలు నిర్వహించింది. ఆరుగురిని అధికారులు అరెస్టు చేశారు.

Next Story

Most Viewed