భారత్‌లో భారీగా కరోనా కేసులు

by  |
భారత్‌లో భారీగా కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 55,079 కొత్త కేసులు నమోదయ్యాయి. 876 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 27 లక్షల 2,742 కు చేరింది. ఇందులో 19,77,779 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 6 లక్షల 73,166 మంది బాధితులు కరోనాతో ఇంకా పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 51,797కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3 కోట్ల 94 వేల కరోనా పరీక్షలు చేయగా, అందులో నిన్న ఒక్కరోజు 8.99 లక్షల కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.


Next Story