యూరిక్ యాసిడ్ పెరిగితే డేంజరా? ఎలాంటి సమస్యలు వస్తాయి?

by Naga Rani Yarlagadda |

శరీరంలో ప్యూరిన్ అనే మూలకం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది సాధారణంగా రక్తంలో కరిగి మూత్రం ద్వారా బయటకు వెళుతుంది.

యూరిక్ యాసిడ్ పెరిగితే డేంజరా? ఎలాంటి సమస్యలు వస్తాయి?
X

దిశ, వెబ్‌డెస్క్: శరీరంలో ప్యూరిన్ అనే మూలకం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది సాధారణంగా రక్తంలో కరిగి మూత్రం ద్వారా బయటకు వెళుతుంది. అయితే ఈ యాసిడ్ స్థాయి ఎక్కువైతే, అది స్ఫటికాలుగా మారి కీళ్లలో పేరుకుపోతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో శరీరం ఈ సమస్యకు సంబంధించిన కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని గమనించడం, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

యూరిక్ యాసిడ్ అధికమై ఉన్నప్పుడు కీళ్లలో తీవ్ర నొప్పి రావడం మొదట కనిపించే లక్షణం. ఒక్కసారిగా, సాధారణంగా పాదం ఉంగరవేలిలో భరించలేని నొప్పి పుడుతుంది. రాత్రిపూట ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాకుండా ఈ నొప్పి సంభవించవచ్చు. అలాగే మోకాళ్లు, వేళ్లు, చీలమండల వద్ద వాపు, వెచ్చదనం ఉండవచ్చు. ఇది స్ఫటికాలు పేరుకుపోవడం వల్ల కలిగే ప్రతిచర్య.

ఇక శరీరంలో మంటలు పెరగడం వల్ల తేలికపాటి జ్వరం, అసౌకర్యం, చెమట పట్టడం వంటి సమస్యలు కనిపించవచ్చు. నిద్రలోనూ ఇబ్బంది కలిగించేలా ఉంటుంది. యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వెళ్లే ప్రక్రియలో అంతరాయం ఏర్పడితే.. మూత్రవిసర్జనలో మంట లేదా తక్కువగా మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి రాత్రిపూట మరింత స్పష్టంగా అనిపించవచ్చు.

కొన్ని సందర్భాల్లో శ్రమ లేకుండానే శరీరం బరువుగా అనిపించవచ్చు. నిద్ర తర్వాత కూడా అలసట ఉండటం, ఉత్సాహంగా లేవలేకపోవడం జీవక్రియల అసమతుల్యతకు సంకేతం కావచ్చు. ఇవన్నీ యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు శరీరం ఇస్తున్న హెచ్చరికలే. అలాగే రోజంతా నొప్పి లేకపోయినా రాత్రిపూట మాత్రమే కీళ్ల నొప్పి ఉంటే, అది యూరిక్ యాసిడ్ ప్రభావంగా పరిగణించాలి.

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. సరైన పరీక్షలు చేయించుకుని, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులతో యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని సమర్థంగా అదుపులో ఉంచుకోవచ్చు.

Next Story