- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
81 శాతం మందికి కరోనా సోకినట్టే తెలియదు: ఈటల
<p>కామారెడ్డి: వైరస్ లపై గతంలో పెద్దగా ప్రచారం లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కోవిడ్-19 పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యుల్లో స్ఫూర్తినింపేందుకే జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో వైద్యుల సేవలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం ర్యాపిడ్ కిట్ల ద్వారా కరోనాను నిర్ధారిస్తున్నామన్నారు. ఆశావర్కర్ల నుండి మొదలు ఉన్నతస్థాయి అధికారుల వరకు నిబద్ధతో పనిచేస్తే కరోనాను ఎదుర్కోవడం కష్టమేమీ కాదని […]</p>

X
కామారెడ్డి: వైరస్ లపై గతంలో పెద్దగా ప్రచారం లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కోవిడ్-19 పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యుల్లో స్ఫూర్తినింపేందుకే జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో వైద్యుల సేవలు అభినందనీయమన్నారు.
ప్రస్తుతం ర్యాపిడ్ కిట్ల ద్వారా కరోనాను నిర్ధారిస్తున్నామన్నారు. ఆశావర్కర్ల నుండి మొదలు ఉన్నతస్థాయి అధికారుల వరకు నిబద్ధతో పనిచేస్తే కరోనాను ఎదుర్కోవడం కష్టమేమీ కాదని సూచించారు. కంటైన్మెంట్ జోన్లకు నిర్వచనం చెప్పిందే తెలంగాణ అని, 81 శాతం మందికి కరోనా సోకినట్టే తెలియదన్నారు. ఆస్పత్రులలో సిబ్బందికి వైరస్ సోకితే బెంబేలెత్తాల్సిన అవసరంలేదని, ధైర్యం, విశ్వాసంతో వైద్యులు పనిచేయాలంటూ భరోసా నింపారు.
Next Story






