ఆదిలాబాద్ జిల్లాలో హెడ్‌ కానిస్టేబుళ్లకు పదోన్నతులు

by  |
ఆదిలాబాద్ జిల్లాలో హెడ్‌ కానిస్టేబుళ్లకు పదోన్నతులు
X

దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో 17మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి లభించింది. వీరిలో నిర్మల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ సందర్బంగా పదోన్నతి పొందిన వారు గురువారం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్చాలు అందజేసారు. పదోన్నతి పొందిన వారికి పదోన్నతి చిహ్నాన్ని ఎస్పీ రాజు అలంకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధికారులు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ విధుల్లో రాణించాలని, పదోన్నతితో ఉద్యోగంపై మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు.



Next Story

Most Viewed