- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ సిద్దిపేట: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు , ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని, పండుగను భక్తి శ్రద్దలతో , ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్నారు. సేవాదృక్పథ భక్తి ప్రవృతులు , సోదరభావాలు మత సామరస్యాన్ని చాటి చెప్పే ఈ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను రాష్ట్ర పండుగగా మన ప్రభుత్వం గుర్తించిందన్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పండుగను సామూహికంగా జరుపులేక పోతున్నాం అని, ఎవరి ఇంట్లో వారే వేడుకగా జరుపుకుని యావత్ ప్రపంచ ప్రజలు అందరం బాగుండాలన్నారు. కరోనా మహమ్మారి భారీ నుండి అందరం బయట పడాలని ఆ అల్లాని ప్రార్ధించాలని హరీష్రావు కోరారు. సిద్దిపేటలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందించాం అని , మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ముస్లింల కొరకు అనేక కార్యకమాలు చేస్తున్నామన్నారు. రంజాన్ మాసమంతా ప్రపంచ వ్యాప్తంగా నిష్టతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.