- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి : వీహెచ్
by Shyam |
<p>దిశ, న్యూస్బ్యూరో : రాష్ట్రంలో (కొవిడ్ -19) కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, ప్రజా సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలతో అఖిపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్-19 నివారణ చర్యలపై ప్రతిపక్షాలు సలహాలు తీసుకుంటున్నారని, రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం సైతం ప్రతిపక్ష పార్టీలను సంప్రదించి సలహాలు తీసుకోవాలని చెప్పినట్టు వెల్లడించారు. కానీ, కేసీఆర్ మాత్రం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు లేదని […]</p>

X
దిశ, న్యూస్బ్యూరో : రాష్ట్రంలో (కొవిడ్ -19) కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, ప్రజా సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలతో అఖిపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్-19 నివారణ చర్యలపై ప్రతిపక్షాలు సలహాలు తీసుకుంటున్నారని, రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం సైతం ప్రతిపక్ష పార్టీలను సంప్రదించి సలహాలు తీసుకోవాలని చెప్పినట్టు వెల్లడించారు. కానీ, కేసీఆర్ మాత్రం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు లేదని విమర్శించారు. ఓటు హక్కు లేదనే.. వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన కరోనా సహాయ నిధి విరాళాల లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
Tags: Corona virus, Modi, KCR, VH, Migrant labour
Next Story






