- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత, మర మగ్గాల కార్మికుల కష్టాలు స్వయంగా తెలుసుకున్న సీఎం కేసీఆర్ మరోసారి ఆదుకోవాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. కరోనా కారణంగా 5నెలలు, అతివృష్టి కారణంగా నేత పని సజావుగా సాగడం లేదని, మగ్గం గుంతల్లో నీళ్లు చేరడంతో పనులు జరగట్లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. మరోసారి త్రిఫ్టు ఫండ్ కింద సాయం, పలు పథకాలను అమలు చేయాలని మంత్రి కేటీఆర్కు ఆదివారం చేనేత కార్మిక సంఘం తరపున ఎల్బీనగర్ అధ్యక్షుడు చెర్కు స్వామినేత ట్విట్వర్, వాట్సాప్ ద్వారా కోరారు. శుభ ముహూర్తాలు లేకపోవడం, కరోనా కష్టాలు, అతివృష్టి వంటితో కార్మికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని, నేతన్నకు చేయూత పథకంలో 8శాతం జమ చేయడం కూడా కార్మికులకు కష్టంగా మారిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వం జమ చేసే 16శాతం నిధిని ప్రతి నేతన్నకు ఖాతాల్లో జమ చేయించాలని విజ్ఞప్తి చేశారు.