నేటి నుంచి ఒంటి పూట బడులు

by  |
schools students
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. అంతేగాకుండా.. ఎండలు భయంకరంగా పెరిగి బయట కాలు పెట్టే పరిస్థితులు లేకుండాపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో రాష్టవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ తాత్కాలికంగా మూసివేశారు. తాజాగా.. విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఉదయం 7.45 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 వరకు తరగతులు ఉంటాయని.. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కోవిడ్-19 నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Next Story