హాజీపూర్ కేసులో నేడు తీర్పు

by  |
హాజీపూర్ కేసులో నేడు తీర్పు
X

హాజీపూర్ వరుస హత్యల కేసులో నల్లగొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను రాచకొండ పోలీసులు కోర్టుకు సమర్పించారు. నిందితుడు శ్రీనివాస రెడ్డికి ఉరి శిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం వరకూ తీర్పు వెలువడనున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి అధికారులు 300 మంది సాక్షుల్ని ప్రశ్నించారు. 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అయితే తాను నిర్దోషినని శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నాడు.


Next Story

Most Viewed