- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హైదరాబాద్: కరోనా పాజిటివ్తో గాంధీలో చికిత్స పొందుతూ.. మృతి చెందాడన్న మధుసూదన్ వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. గాంధీ ఆస్పత్రి సిబ్బంది చనిపోయాడని ధృవీకరించినప్పటికీ.. బాధితుడి భార్య వాటిని కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన భర్త ఆచూకీ తెలపాలని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అసలు తన భర్త బతికి ఉన్నాడో లేదో అని స్పష్టం చేయాలంటూ అల్లంపల్లి మాధవి ఆ పిటిషన్లో అనుమానం వ్యక్తం చేశారు. బతికే ఉన్నా వివరాలు చెప్పడం లేదని ఆరోపించారు. చనిపోతే మరణ ధృవీకరణ పత్రం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. అంతేకాకుండా, తన భర్తను హాజరు పరిచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ను గురువారం విచారించిన ఉన్నత న్యాయస్థానం మధుసూదన్ మరణించాడో.. బతికే ఉన్నాడో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ మృతి చెందిన ఆ విషయం బాధితుడి భార్యకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో సమాధానం చెప్పాలని ఆదేశిస్తూనే.. విచారణను రేపటికి వాయిదా వేసింది.