ప్రైవేట్ పార్ట్స్ పట్టుకున్న స్కూటరిస్ట్.. తాట తీసిన యువతి

by  |
Scooty Into Drain
X

దిశ, ఫీచర్స్: పట్ట పగలు, నడివీధిలో మహిళలను వేధింపుల గురించి నిత్యం వింటూనే ఉంటాం. జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో అగంతకులు ఎక్కువగా ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. చాలా సందర్భాల్లో బాధితులు వాళ్లను పట్టుకోలేక నిత్యం ఆ చేదు సంఘటన తలచుకుని బాధపడుతుంటారు. తాజాగా గువాహటిలో పట్టపగలు, నడి రోడ్డుపైనే ఓ యువతి వేధింపులకు గురైంది. ఈ అకస్మిక ఘటనకు ముందుగా నిర్ఘాంతపోయినా, వెంటనే తేరుకుని నిందితున్ని పట్టుకున్న తీరును వివరిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా.. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

గువాహటిలో భావనా కశ్యప్ అనే యువతి రోడ్డుపై వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తి అడ్డగించాడు. అడ్రస్ అడిగే నెపంతో దగ్గరికొచ్చిన సదురు వ్యక్తి తనను పట్టుకోవడంతో షాక్‌కు గురైంది. అయితే ఏమాత్రం భయపడకుండా.. నిందితుడు పారిపోకుండా ఉండేందుకు అతడి స్కూటర్‌ను గట్టిగా పట్టుకుని ఓపెన్ డ్రైన్‌లో లాగింది. ఈ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేసిన భావన.. ఆ వివరాలను పంచుకుంది. ‘రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి నన్ను ఆపి అడ్రస్ అడిగాడు. నాకు తెలియదని సమాధానమిచ్చా. అయితే నా మాటలు పూర్తవకముందే, ఆ వ్యక్తి ఆమె ప్రైవేట్‌ పార్ట్స్(రొమ్ములను) చేతులతో తడిమాడు. ఈ ఊహించని పరిణామంతో క్షణం పాటు ఏం జరిగిందో అర్థం చేసుకోలేకపోయా’ అని రాసుకొచ్చింది. మొత్తానికి సడెన్ షాక్ నుంచి తేరుకుని.. నిందితుడు పారిపోకుండా స్కూటర్‌ను గ్టటిగా పట్టుకుని నియంత్రించగలిగానని, ఆ తర్వాత మురుగునీటి కాల్వలో పడేశానని చెప్పింది.

తనకు జరిగిన విధంగా మరే మహిళకు జరగకూడదని, ఇలాంటి సంఘటనల్ని అందరూ ధైర్యంగా ఎదుర్కోవాలని ఇలా చేసినట్టు భావన వెల్లడించింది. ఈ క్రమంలో అక్కడ గుమిగూడిన స్థానికులు అతన్ని ‘మధుసూదన రాజ్‌కుమార్’గా గుర్తించారు. అంతలోనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి దిస్పూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed