చిత్తూరు జిల్లా పోలీసుల స్పెషల్ డ్రైవ్… 503 తుపాకుల స్వాధీనం

by  |

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిల్లాలో అడవి జంతువుల వేట పెరుగుతున్న నేపథ్యంలో కోళ్ల బైలు, మాలెపాడుల్లో 21 తుపాకులు దొరకడంతో జిల్లా వ్యాప్తంగా సెర్చ్ మొదలు పెట్టారు. వారం రోజుల పాటు జరిగిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 503 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు సబ్ డివిజన్ పరిథిలో 275 నాటు తుపాకలు స్వాధీనం చేసుకుంటే, మదనపల్లి సబ్ డివిజన్‌ పరిథిలో 125, చిత్తూరు సబ్ డివిజన్‌ పరిథిలో 49, పుత్తూరు సబ్ డివిజన్‌ పరిథిలో మరో 54 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed