- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుంజన్ సక్సేనా.. ది కార్గిల్ గర్ల్. ఆకాశాన్ని పాలించేందుకు నేలపై నిల్చుని కలలుగన్న ఓ సాధారణ అమ్మాయి స్ఫూర్తి గాథ. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. గుంజన్ సక్సేనా టైటిల్ రోల్లో జాన్వీ కపూర్ జీవించగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రశంసలు అందుకుంటోంది. శ్రీ విద్యా రాజన్తో కలిసి కార్గిల్ యుద్ధ మండలంలో ఐఏఎఫ్ చిరుత హెలికాప్టర్లను నడిపిన భారతదేశపు తొలి మహిళగా రికార్డు సృష్టించిన గుంజన్ సక్సేనా.. ఆ చరిత్రను సృష్టించేందుకు, తన కలను సాకారం చేసుకునేందుకు ఎన్ని కష్టాలను ఎదుర్కొంది.. అసమాన ధైర్యంతో అసమానతలకు నిలబడి ఎలా పోరాడిందనేది ట్రైలర్లో చూపించారు. సైన్యంలో పని చేస్తున్న సమయంలో తోటివారి నుంచి వివక్షను ఎదుర్కొన్న గుంజన్ సక్సేనా ఎలా నిలబడగలిగింది అనేది కథ కాగా.. జాన్వీ నటనకు ప్రశంసలు అందుతున్నాయి.
ట్రైలర్తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచిన గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్ చిత్రం.. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 12న రిలీజ్ కానుంది. నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్గా రిలీజ్ కానున్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.