- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గాంధీనగర్: ఈ నెల 21 నుంచి ఐదు రోజులపాటు గుజరాత్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొశ్చన్ అవర్ను ఉండబోదని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రదీప్సిన్హా జడేజా మాట్లాడుతూ, ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడానికి రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గూండా నియంత్రణ చట్టం, పాసా యాక్ట్, భూకబ్జా వ్యతిరేక చట్టం, రెవెన్యూ సంస్కరణలు సహా 24 కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు.
ఈ సమావేశాల్లో కొశ్చన్ అవర్ను రద్దు చేసినట్టు వివరించారు. సీనియర్ అధికారులు చాలా మంది కరోనా కట్టడి చర్యలను సమన్వయం చేయడానికి పలు జిల్లాల్లో ఉన్నారని, అందుకే కొశ్చన్ అవర్ను రద్దు చేయాలని స్పీకర్ను సీఎం విజయ్ రూపానీ అభ్యర్థించగా, అందుకు స్పీకర్ అంగీకరించారని తెలిపారు. త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశాల్లోనూ కొశ్చన్ అవర్ను రద్దు చేయడంపై విపక్షాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే.