- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు టీచర్లుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2000, బియ్యం 25కిలోలు అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్చి 16, 2020 నాటికి గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని అర్హులుగా ప్రకటించారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసేవారు https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని తెలిపారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాత, ఆధార్ వివరాలను నమోదు చేయాలని సూచించారు.
ఈ పత్రాలను ప్రింట్ తీసుకొని సంబంధిత ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి అందించాలని తెలిపారు, పాఠశాలల యాజమాన్యం జిల్లావిద్యాధికారికి టీచర్ల వివరాలను అందించాలని తెలిపారు. విద్యాశాఖ అధికారులు దరఖాస్తు దారులను ధృవీకరించి కలెక్టర్కు వివరాలను అందజేస్తారు. జిల్లా కలెక్టర్ తెలంగాణలోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు ప్రైవేటు టీచర్ల వివరాలను సమర్పిస్తారు. ఈ డేటాను ఆర్థిక శాఖ, పౌర సరఫరాల శాఖలు పరిశీలను చేపట్టి పథకాన్ని అమలు చేస్తారు. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించేంత వరకు ప్రతి నెల 25 కిలోల బియ్యాన్ని రూ.2000లను అందిచనున్నారు.