లక్ష్మణ్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న ఆ కుర్రాడెవరో తెలుసా?

by  |
లక్ష్మణ్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న ఆ కుర్రాడెవరో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : సినీ తారలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు, కనపడగానే అందరూ ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడతారు. ఇప్పుడంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు కానీ.. ఒకప్పుడు తమ అభిమాన క్రికెటర్, సెలబ్రిటీ కనపడితే ఇలా ఆటోగ్రాఫ్‌లు తీసుకునేవాళ్లు. దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. హైదరాబాద్ రంజీ జట్టు తరపున ఆడి ఆ తర్వాత టీమ్ ఇండియాలో కీలక సభ్యుడిగా మారిపోయాడు. ఆస్ట్రేలియా జట్టుకు కలలో కూడా వీవీఎస్ కనపడేవాడు. అందుకే అందరూ వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అని పిలిచే వారు. అలాంటి వీవీఎస్ యువ క్రికెటర్‌గా ఉన్నప్పుడు ఈ చిన్నారులు ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

అక్కడ బాణం గుర్తు పక్కన ఒక పిల్లాడు ఆటోగ్రాఫ్ తీసుకుంటూ కనిపిస్తున్నాడు చూశారా. అతను ఎవరో తెలుసా? టీమ్ ఇండియా యువ పేసర్, హైదరాబాదీ అయిన మహ్మద్ సిరాజ్. చిన్నప్పటి నుంచి సిరాజ్‌కు క్రికెట్ అంటే మక్కువ. తన అభిమాన క్రికెటర్ వీవీఎస్ కనపడగానే ఇలా ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఒకప్పుడు కుర్రాడిగా ఉన్న సిరాజ్.. ఇప్పుడు పెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. టీమ్ ఇండియాలో స్థానం సంపాదించి తండ్రి కోరిక నెరవేర్చాడు. హైదరాబాద్ రంజీ జట్టు మాజీ ఓపెనర్ అబ్దుల్ అజీమ్ దగ్గర ఈ ఫొటో ఉంటే.. ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేష్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.


Next Story

Most Viewed