షర్మిలకు పెరుగుతున్న మద్దతు

by  |
షర్మిలకు పెరుగుతున్న మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో ఖమ్మం వేదికగా కొత్త పార్టీని ప్రకటించనున్న క్రమంలో వైఎస్ షర్మిలకు పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు షర్మిల పార్టీలో చేరగా.. మరికొంతమంది పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

తాజాగా హైకోర్టు, నగర సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు న్యాయవాదులు షర్మిలకు మద్దతు ప్రకటించారు. లోటస్ పాండ్‌లో సోమవారం న్యాయవాదులు వైఎస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముందడుగు వేస్తున్న షర్మిలకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ సర్పంచులు, కరీంనగర్ జిల్లా మంథన్ నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ సర్పంచ్ షర్మిలను కలిసి తమ మద్దతు ప్రకటించారు.

Next Story

Most Viewed