నగరంలో వెలిగిన చిరుదివ్వెలు..

by  |
నగరంలో వెలిగిన చిరుదివ్వెలు..
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ప్రజలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగింఛి ఐక్యతను చాటారు. కరోనా వైరస్‌ను తరిమి కొట్టేందుకు ప్రజలంతా ఐక్యత చాటాలని, అందుకు ఆదివారం రాత్రి 9 గంటలకు ఇండ్లల్లో లైట్లన్నీ ఆఫ్ చేసి కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నగర ప్రజలు.. దీపాలు వెలిగించే కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మద్ధతు తెలిపారు. కాలనీలు, బస్తీల్లో నివసించే వారంతా సరిగ్గా రాత్రి 9 గంటలకు తమ తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రతి ఒక్కరూ కొవ్వొత్తులు వెలిగించి సమైక్యతను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సెలెబ్రెటీల నుంచి సామాన్యుల వరకు పాల్గొన్నారు.

Tags: Hyderabad, PM Modi call, Lights Off, Candles

Next Story

Most Viewed