మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఊరట

by  |
మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన 70 రోజులుగా రిమాండ్ లో ఉన్నాడు. ఆయనకు కరోనా సోకడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం విధితమే. అప్పటి నుంచి ఇటు ప్రభుత్వం, అటు టీడీపీ మధ్య రాజకీయ యుద్ధమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed