కానిస్టేబుల్‌పై పూల వర్షం

by  |
కానిస్టేబుల్‌పై పూల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా‌ను జయించిన కానిస్టేబుల్‌ విధులకు హాజరయ్యాడు. ఆయనకు స్టేషన్‌లో అపూర్వ స్వాగతం లభించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని తిమ్మాపురం పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. సత్యనారాయణ అనే కానిస్టేబుల్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. దాదాపు 28 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండి వైరస్‌ను జయించాడు. అనంతరం విధులకు హాజరుకాగా, మిగతా సిబ్బంది అతనిపై పూల వర్షం కురిపించి వెల్‌కమ్ చెప్పారు.

Next Story

Most Viewed