సిమెంట్ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు

by  |
సిమెంట్ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: సిమెంటు పరిశ్రమ కోసం ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసింది. దాల్మియా భారత్ గ్రూప్ సీఎండీ పునీత్ దాల్మియా చైర్మన్‌గా నియమిస్తూ మొత్తం ఈ కమిటీలో 25 మంది సభ్యులు ఉంటారని ప్రభుత్వం తెలిపింది. ఆల్ట్రాటెక్ సిమెంట్ ఎండీకేసి జన్వార్ కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ (డీసీసీఐ) పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రెండేళ్ల కాలపరిమితి ఉంటుందని అంతర్గత వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కమిటీ ప్రధానంగా సిమెంట్ పరిశ్రమలోని వ్యర్థాలను నివారించడం, గరిష్ఠ ఉత్పత్తిని సాధించడం, నాణ్యత పెంపు, ఖర్చుల తగ్గింపు, ఉత్పత్తి ప్రమాణాలను మెరుగుపరచడం లాంటి కీలక అంశాలపై మార్గాలను సూచిస్తుంది.

అలాగే, పరిశ్రమ పనితీరును మెరుగుపరచడం, సామర్థ్యం తక్కువున్న ప్లాంట్‌లపై నిర్ణయాలు-సిఫారసులు చేయడం, పరిశ్రమలోని కార్మికులకు ప్రత్యేక శిక్షణ, వారి భద్రతా ప్రమాణాలు, శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనలు, కొత్త పరికరాలు, విధానాల అభివృద్ధి సహా ఇతర అంశాలపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. ఈ కమిటీలో.. శ్రీ సిమెంట్ ఎండీ హెచ్ఎం బంగూర్, జేకే సిమెంట్ డప్యూటీ ఎండీ మాధవ కృష్ణ, ఇండియా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాకేష్ సింగ్, బిర్లా కార్పొరేషన్ సీఈఓ ప్రచెతా మజుందార్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ సీఈఓ నీలేష్ నార్వెకర్ షా ఇతర సభ్యులున్నారు.

Next Story

Most Viewed