సంస్థలకు ఆర్థిక వెసులుబాటు!

by Harish |

<p>దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనాపై యుద్ధానికి సిద్ధమైన వేళ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా, రుణాల చెల్లింపుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరగా సంస్థలకు(ఎమ్ఎస్ఎమ్ఈ) వెసులుబాటు ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కరోనాను అరికట్టే వరకూ రుణాలను ఆలస్యంగా చెల్లించేలా అవకాశమివ్వనున్నారు. అంతేకాకుండా ఆర్థికపరమైన సహకారం కూడా ఇచ్చేలా కావాల్సిన చర్యల గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌తో చర్చించినట్టు ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. ఈ సమావేశంలో జీఎస్టీ గురించి చర్చకు [&hellip;]</p>

సంస్థలకు ఆర్థిక వెసులుబాటు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనాపై యుద్ధానికి సిద్ధమైన వేళ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా, రుణాల చెల్లింపుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరగా సంస్థలకు(ఎమ్ఎస్ఎమ్ఈ) వెసులుబాటు ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కరోనాను అరికట్టే వరకూ రుణాలను ఆలస్యంగా చెల్లించేలా అవకాశమివ్వనున్నారు. అంతేకాకుండా ఆర్థికపరమైన సహకారం కూడా ఇచ్చేలా కావాల్సిన చర్యల గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌తో చర్చించినట్టు ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. ఈ సమావేశంలో జీఎస్టీ గురించి చర్చకు వచ్చినట్టు, అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

Tags :coronavirus, economy, msme, msme sector, effect of coronavirus, fm, nirmala sitharaman

Next Story