మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు గవర్నర్ బీబీ హరిచందన్

by  |
AP Governor
X

దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడురోజుల ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగే గవర్నర్ల సదస్సుకు హాజరు కానున్నారు. రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ సదస్సు గురువారం జరగనుంది. దేశంలోని విభిన్న అంశాలపై రాష్ట్రపతి గవర్నర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి నివేదికలు సమర్పిస్తారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గవర్నర్ బీబీ హరిచందన్ వెంట గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇకపోతే బుధవారం సాయంత్రం ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో గవర్నర్ హరిచందన్ మర్యాద పూర్వకంగా భేటీ కానున్నారు. మూడు రోజుల పర్యటన అనంతరం శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఢిల్లీ నుంచి విజయవాడ రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.


Next Story

Most Viewed