ఫ్లాష్.. ఫ్లాష్.. టెన్త్ క్లాస్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

by  |
10th class exams
X

దిశ, డైనమిక్ బ్యూరో : పదవ తరగతి పరీక్షలపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ అదుపులోకి రావడంతో సెప్టెంబర్ 1 నుంచి బడులను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో మార్చిలో జరగనున్న పదవ తరగతి పరీక్షలపై ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పటిలాగా 11 పేపర్లు కాకుండా ఈ ఏడాది కేవలం 6 పేపర్లు మాత్రమే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా సెకండ్ ల్యాంగ్వేజ్ ఆప్షనల్‌గా ఉర్దూ పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది.


Next Story

Most Viewed