- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి
<p>దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, ఎల్లారెడ్డిలోని ఏరియా ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ శరత్ సందర్శించారు. కరోనా లక్షణాలున్న వ్యక్తులను ఐసోలేషన్ వార్డులలో ఉంచాలని తెలిపారు. ఎల్లారెడ్డి ఆదర్శ డిగ్రీ కళాశాలలో 50 పడకల వార్డులను ఏర్పాటు చేయాలని వైద్య అధికారులకు సూచించారు. కరోనా రాకుండా ప్రతి వ్యక్తి సామాజిక దూరం పాటించాలని కోరారు. ప్రజలు ఆందోళన చెందవద్దని డాక్టర్ శరత్ అన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 31 వరకు అన్ని వర్గాల […]</p>

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, ఎల్లారెడ్డిలోని ఏరియా ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ శరత్ సందర్శించారు. కరోనా లక్షణాలున్న వ్యక్తులను ఐసోలేషన్ వార్డులలో ఉంచాలని తెలిపారు. ఎల్లారెడ్డి ఆదర్శ డిగ్రీ కళాశాలలో 50 పడకల వార్డులను ఏర్పాటు చేయాలని వైద్య అధికారులకు సూచించారు. కరోనా రాకుండా ప్రతి వ్యక్తి సామాజిక దూరం పాటించాలని కోరారు. ప్రజలు ఆందోళన చెందవద్దని డాక్టర్ శరత్ అన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 31 వరకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లాలో లాక్డౌన్ అమల్లో ఉన్నందున వ్యాపారులు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలన్నారు. కరోనా నియంత్రణ దృష్ట్యా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లరాదని హెచ్చరించారు.
Tags: collector sharath, comments, Government, guidelines, kamareddy
slug:






