వైద్య సిబ్బందికి సౌకర్యాలు లేవ్

by  |
వైద్య సిబ్బందికి సౌకర్యాలు లేవ్
X

దిశ, సికింద్రాబాద్: కరోనా నిర్మూలనకు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నా వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు ఎం.నర్సింహా విమర్శించారు. మంగళవారం మారేడుపల్లి మండల కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందికి సరిపడా సౌకర్యాలు లేవన్నారు. అనంతరం తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎ.వీరేశం, సలావుద్దిన్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed