విగలాంగులపై దాడికి ప్రభుత్వ ఉద్యోగి ప్రయత్నం.. ఇదేంటని ప్రశ్నిస్తే మీడియా ముందే..

by  |
విగలాంగులపై దాడికి ప్రభుత్వ ఉద్యోగి ప్రయత్నం.. ఇదేంటని ప్రశ్నిస్తే మీడియా ముందే..
X

దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు పలు సమస్యలపై ఆర్డీవోకి వినతి పత్రం అందజేయడానికి ఆర్డీవో ఆఫీస్‌కి చేరుకున్నారు. అయితే.. ఆ సమయంలో ఆర్డీవో లేకపోవడంతో చాంబర్ ముందు విధులు నిర్వహిస్తున్న అటెండర్ నరేష్ వద్దకు వెళ్లి వారి వెంట తెచ్చుకున్న వినతిపత్రాన్ని ఎవరికి ఇవ్వాలి అని సైగలతో అడిగారు.

ఈ నేపథ్యంలో మాటలురాని వికలాంగులపై జాలి చూపించాల్సిందిపోయి.. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ కొట్టడానికి ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. ఆ సమయంలో ఆర్డీవో లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడని తెలిసింది. ఈ విషయం తెలుసుకొని వివరణ కోరిన విలేకరుల ముందే.. అప్పుడు దాడి చేయలేదు, ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు దాడి చేస్తా అంటూ దురుసుగా ప్రవర్తించడం గమనార్హం.



Next Story

Most Viewed