షార్ట్ ఫిల్మ్‌తో.. ఏం మాయ చేశారు !

by  |
షార్ట్ ఫిల్మ్‌తో.. ఏం మాయ చేశారు !
X

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘ఏ మాయ చేసావే‘ సినిమా టాలీవుడ్‌లో ఎంత మాయ చేసిందో అందరికీ తెలిసిందే. కార్తిక్, జెస్సీగా.. నాగ చైతన్య, సమంత కనిపించగా.. తమిళ్‌లో ఇవే పాత్రలలో నటించారు శింబు, త్రిష. ఇక్కడ చై సామ్ ఈ చిత్రంతో ఎంత మాయ చేయగలిగా రో.. తమిళనాట అంతే మెస్మరైజ్ చేశారు త్రిష, శింబు.

అయితే లాక్‌డౌన్ సమయంలో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కార్తిక్ డయల్ సేతా యెన్’ పేరుతో షార్ట్ ఫిల్మ్ తీశాడు దర్శకుడు గౌతమ్ మీనన్. ఈ సినిమాలో త్రిష( జెస్సీ) మరొకరి భార్య పాత్ర చేయగా.. లాక్‌డౌన్‌తో డిప్రెషన్‌లో ఉన్న కార్తిక్ పాత్రలో శింబు కనిపించాడు. ఇందులో కథ రాస్తుండే శింబు.. డిప్రెషన్ కారణంగా కంటిన్యూ చేయలేకపోతాడు. అదే టైమ్‌లో జెస్సీ గుర్తొచ్చి తనకు కాల్ చేస్తాడు. కేరళలో ఉన్నావని నాకు తెలుసు జెస్సీ అంటాడు. నీకెలా తెలుసంటే.. ఫేస్‌బుక్‌లో మీ సోదరి తన పోస్ట్‌లో నువ్వు మాస్కులు పంచుతున్న ఫోటో చూశా అని చెప్తాడు. ఆ తర్వాత తన కుటుంబం గురించి అడిగి తెలుసుకుంటాడు కార్తిక్. ఈ క్రమంలో ‘నువ్వు నాకు కావాలి జెస్సీ.. లవ్ యూ అని చెప్పగా.. లవ్ యూ టూ చెప్పిన జెస్సీ.. నేను నిన్ను ఒక బిడ్డలా ప్రేమిస్తాను. నీలో గొప్ప టాలెంట్ ఉంది, మంచి సినిమా కథ రాయి.. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి’ అంటూ ధైర్యం చెప్తుంది జెస్సీ.

ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ మెస్మరైజ్ చేయగా.. షార్ట్ ఫిల్మ్ సింప్లీ సూపర్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్.

https://www.youtube.com/watch?v=sO5a-_K-bFU&feature=youtu.be


Next Story