సింధూ విజయంపై గోపీచంద్ కామెంట్స్

by  |
coach pullela gopichand
X

దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి పీవీ సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. సింధు విజయంపై జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పందించారు. సింధు అత్యుత్తమంగా ఆడిందని, చాలా ఆనందంగా ఉందని అన్నారు.

అంతేకాకుండా బింగ్జియావోపై అన్ని రంగాల్లో పైచేయి సాధించిందని గుర్తు చేశారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించడం సాధారణ విషయం కాదన్నారు. సింధు, కోచ్‌ల బృందం, సహాయ సిబ్బంది కష్టానికి ఫలితం దక్కిందని గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు.



Next Story