కొత్త సంవత్సరంలో శుభవార్త వింటారు: వైద్యారోగ్య శాఖ

by  |
కొత్త సంవత్సరంలో శుభవార్త వింటారు: వైద్యారోగ్య శాఖ
X

దిశ,వెబ్‌డెస్క్: కరోనా స్ట్రెయిన్‌తో భయం లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనాలో ఇప్పటి వరకు మొత్తం 17 మార్పులు జరిగాయని తెలిపింది. అందులో 8 ముఖ్యమైనవని చెప్పింది. ఇప్పటి వరకు 5వేల జీనోమ్ స్వీక్వెన్స్ పరీక్షలు చేశామని వెల్లడించింది. ఇప్పుడున్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌కు కూడా పనిచేస్తాయని వివరించింది. వైరస్‌లో మార్పులు జరిగినా వ్యాక్సిన్ యాంటీ బాడీలు ఉత్పత్తి చేస్తాయని స్పష్టం చేసింది. కరోనా స్ట్రెయిన్ పై పరిశోధనకు 10 ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని చెప్పింది. వ్యాక్సిన్‌కు సంబంధించి కొత్త సంవత్సరంలో శుభవార్త వింటారని పేర్కొంది.

Next Story

Most Viewed