ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

by  |
AP CM Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రికల్‌ వాహనాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డౌన్‌పేమెంట్ లేకుండా ఈఎంఐ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రికల్‌ టూవీలర్లను అందించనుంది. సచివాలయ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్‌టీపీసీ/ఈఈఎస్‌ఎల్‌ వంటి సంస్థలతో కలిసి నెడ్‌క్యాప్‌ ఒక పథకాన్ని రూపొందించినట్లు ఇంధన శాఖ తెలిపింది. వాహనానికి సంబంధించి ఈఎంఐను 60 నెలల్లో తీర్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

Next Story

Most Viewed