మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్

by  |
మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాలేజీలకు వెళ్లి విధులు నిర్వహించే గర్భిణీ ఉద్యోగులకు ఇంటర్ విద్యా కమిషనర్ గుడ్ న్యూస్ చెప్పారు. విధులు నిర్వర్తిచేందుకు కాలేజీలకు వచ్చే విధానాన్ని తప్పిస్తూ విద్యా కమిషనర్ శైలజ రామయ్యర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటినుంచే తమ విధులు నిర్వహించేందుకు అనుమతించారు. కొవిడ్ నేపథ్యంలో కాలేజీలకు వెళ్లడం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, మహిళా ఉద్యోగులు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకొచ్చారు. శాఖ తరఫున విద్యా కమిషనర్‌కు ప్రతిపాదనలు అందాయి. ఈ నేపథ్యంలో గర్భిణి ఉద్యోగులు కాలేజీకి రాకుండానే ఇంటినుంచి విధులు నిర్వర్తించేందుకు అంగీకరిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story