కోటీశ్వరులను చేస్తామని…అప్పుల పాలు చేసింది.

by  |
కోటీశ్వరులను చేస్తామని…అప్పుల పాలు చేసింది.
X

దిశ వెబ్ డెస్క్:
మూడేండ్లలో గొల్లకురుమలను కోటిశ్వరులను చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పిందనీ , తీరా చూస్తే ఇప్పుడు అప్పుల పాలు చేసిందని గొల్లకురుమ నాయకులు ఉడుత రవీందర్ అన్నారు. గొర్రెలమేకల పెంపకం దార్ల(జీఎంపీఎస్) ఆధ్వర్యంలో గొల్లకురుమ నేతలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….గొర్రెలు వస్తాయని చెబితే తాము ఆశపడ్డామని తెలిపారు. ఆ ఆశతోనే పుస్తెలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చామని ఆయన అన్నారు. బ్యాంకులకు డీడీలు కట్టి రెండేండ్లుగా ఇంకా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

Next Story

Most Viewed